కరోనాకు విరుగుడుగా గబ్బిలం మాంసం..దానికై పరుగులు పెడుతున్న జనం
- January 26, 2020
చైనా దేశంలో కలకలం రేపుతున్న కరోనా వైరస్ కు విరుగుడుగా గబ్బిలాన్ని తినమని చెబుతుండటం తో ఆ దేశ ప్రజలు గబ్బిలాలు తినడానికి పరుగులెత్తుతున్నారు.కరోనా వైరస్ బారినపడిన అనేక మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోగా వేలాది మంది ఈ వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ వైరస్కు విరుగుడు గబ్బిలం మాంసం, గబ్బిలం ఎముకలతో చేసిన సూప్ అనే ప్రచారం సాగుతోంది. దీంతో అనేకమంది గబ్బిలంను ఆరగించేందుకు పోటీపడుతున్నారు.
ఓ యువతి రెస్టారెంట్లో కూర్చున్న గబ్బిలంతో చేసిన సూప్ను కూడా తాగేసింది. వండిన గబ్బిలాన్ని ఆమె ఎంత ఇష్టంగా తిందంటే.మాంసమే కాకుండా దాని చర్మాన్ని కూడా తీనేందుకు యత్నించింది. చర్మం తినకూడదని అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమెకు చెప్పారు.
చైనాలో కరోనా వైరస్ కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు బలిగొని, మరో 600 మందికి వ్యాపించింది. పాము, గబ్బిలాల నుంచే ఈ వైరస్ మనుషులకు వ్యాపించినట్టు పెకింగ్ యూనివర్సిటీ పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ చైనా యువతి ఇలా గబ్బిలాన్ని తినేసింది. ఈ వీడియోను మీరు కూడా తిలకించండి.
#China #WuhanCoronavirus The probable cause of transmission to man of the #coronavirus: Chinese taste for exotic foods such as the bat eaten by the girl here. pic.twitter.com/cIOnaOnJXx
— Free Mind (@FreeMindHK) January 23, 2020
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







