ఇ-వీసా సిస్టమ్తో రిజిస్టర్ కావాల్సిందిగా కంపెనీలకు సూచన
- January 26, 2020
మస్కట్: కంపెనీలు అలాగే ఇన్స్టిట్యూషన్స్ ఇ-వీసా సిస్టమ్తో రిజిస్టర్ అవ్వాల్సిందిగా రాయల్ ఒమన్ పోలీస్ సూచించడం జరిగింది. ఇప్పటిదాకా అలా రిజిస్టర్ చేసుకోని కంపెనీలు, ఇన్స్టిట్యూషన్స్ తక్షణమే సమీపంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పాస్పోర్ట్స్ అండ్ రిసెఇడెన్స్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది రాయల్ ఒమన్ పోలీస్. కొత్త విధానం ద్వారా సంబంధిత ఎస్టాబ్లిష్మెంట్స్ తాలూకు పీఆర్వోలు లేదా ఆథరైజ్డ్ అఫీషియల్స్ వర్క్ వీసా కోసం కార్యాలయాల్ని సందర్శించాల్సిన అవసరం వుండదు. చాలా తేలిగ్గా ఈ-విధానం ద్వారా ఫార్మాలిటీస్ని పూర్తి చేసుకోవచ్చు. కొత్త ఎలక్ట్రానిక్ వీసా విధానం, నేషనల్ ఇ-గవర్నెన్స్ పాలసీలో భాగంగా వినియోగదారులకి సమయాన్ని అలాగే శ్రమనీ తగ్గించేలా రూపొందించారు. రిజిస్టర్ చేసుకున్న సంస్థలు, వర్క్ వీసాలకోసం ఆన్లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్, రెండు ఫొటోగ్రాఫ్స్, పాస్పోర్ట్ కాపీ, ఒరిజినల్ లేబర్ పర్మిట్ (మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ జారీ చేసింది) ఈ విధానం ద్వారా సబ్మిట్ చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







