8 కిలోలకు పైబడిన క్యాబిన్ లగేజ్కి ఛార్జీ
- January 27, 2020
ఒమన్ నుంచి ఎయిర్ ఇండియా విమానాల్లో వచ్చే ప్రయాణీకులకు 8 కిలోల లిమిట్ మించితే క్యాబిన్ లగేజ్కి ఛార్జీ వర్తిస్తుంది. మస్కట్లో ఎయిర్ ఇండియా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఓవర్ వెయిట్ హ్యాండ్ బ్యాగేజీ ఇకపై ఛార్జ్ చేయబడుతుందనేది ఆ ప్రకటన సారాంశం. డ్యూటీ ఫ్రీ షాప్స్లో కొనుగోలు చేసే వస్తువులకూ ఇది వర్సించనుంది. ప్రతి అదనపు కిలోగ్రామ్కీ 6 ఒమన్ రియాల్స్ ఛార్జ్ వసూలు చేస్తారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాబిన్ లగేజ్ బరువు 10 కిలోలకు మించరాదు. ఇందులో 8 కిలోల బ్యాగేజ్ ఉచితం కాగా, రెండు కిలోలకి అదనపు ఛార్జీ వసూలు చేస్తారు. 10 కిలోల బరువు మించితే క్యాబిన్లోకి అనుమతించరు లగేజ్ని. అలాగే హ్యాండ్ బ్యాగేజీ 55 సెంటీమీటర్ల ఎత్తు, 35 సెంటీమీటర్ల పొడవు, 25 సెంటీమీటర్ల వెడల్పుని మించకూడదు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..