ప్రముఖ బుల్లితెర నటుడు హఠాత్మరణం..
- January 27, 2020
బెంగళూరు:గత కొద్దికాలంగా సినీ ఇండస్ట్రీని విషాదాలు అలుముకున్నాయి. తాజాగా కన్నడ బుల్లితెర నటుడు, హోస్ట్ సంజీవ్ కులకర్ణి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై అకాల మరణం చెందారు. దీంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదం నెలకొంది.
ప్రముఖ కన్నడ సీరియల్స్ నాగిని.. రాజారాణి.. ఏటు-ఎదురీతతో సంజీవ్ కులకర్ణి ప్రేక్షకుల సుపరిచితుడు. కొద్దికాలంగా ఆయన కార్డియోమయోపతితో బాధపడుతున్నారు. దీనికి నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు. సంజీవ్ కులకర్ణి కుమారుడు సౌరభ్ కూడా నటుడే.
ఇక ప్రతీ నెలా సంభ్రమ- సౌరభ పేరుతో సంజీవ్ కులకర్ణి ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చేవారు. కాగా, ఆయన మరణవార్త విన్న పలువురు టీవీ, సినీ రంగ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!