ఐపీఎల్ 2020 తేదీలు ఖరారు
- January 28, 2020ఇండియా:ఈఏడాది ఐపీఎల్ సీజన్ కోసం గత ఏడాది డిసెంబర్ లో ఆటగాళ్ల వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈవేలంతో ప్రస్తుతం అన్ని జట్లు బలంగా కనిపిస్తున్నాయి. ఇక తాజాగా జరిగిన సమావేశంలో ఐపీఎల్ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశం ముగిశాఖ మీడియా తో ఆ వివరాలు వెల్లడించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. అందులో భాగంగా ఈ ఐపీఎల్ ఇంతకుముందు సీజన్లలా కాకుండా కొంచెం ముందుగానే స్టార్ట్ కానుంది. మార్చి 24న ఈ ఐపీఎల్ సీజన్ స్టార్ అయ్యి మే 29తో ముగియనుంది. అలాగే ముంబై లో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ చరిత్రలో మంబై లో ఫైనల్ జరుగనుండడం ఇది నాల్గో సారి. ఇక రాత్రి వేళల్లో జరిగే మ్యాచ్ ల సమయాల్లో మార్పు ఉండదని ఈసీజన్ ఐపీఎల్ మ్యాచ్ లు కూడా యధావిధిగా రాత్రి 8 గంటలకే స్టార్ట్ అవుతాయని గంగూలీ వెల్లడించాడు.
ఐపీఎల్ మ్యాచ్ లను 8గంటలకు కాకుండా 7 గంటలకు స్టార్ట్ చేయాలని కొన్ని నెలలు గా లీగ్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న స్టార్ స్పోర్ట్స్ ,బీసీసీఐ పై ఒత్తిడి తీసుకొస్తుంది. అయితే ఐపీఎల్ ప్రాంఛైజీలు ఇందుకు ఒప్పుకోలేదు. దాంతో బీసీసీఐ కూడా ప్రాంఛైజీల నిర్ణయానికే ఓటు వేసింది. ఇక అలాగే రెండు మ్యాచ్ లున్న రోజులను కుదించాం. 5రోజులే(సాయంత్రం 4గంటలు ,రాత్రి 8గంటలు ) ఈ మ్యాచ్ లు జరుగనున్నాయి. ఇక మొదటి సారి ఈ సీజన్లో కంకషన్ సబ్ స్టిట్యూట్ ను ప్రవేశపెడుతున్నాం. నో బాల్ ను మూడో ఎంపైర్ నిర్ణయిస్తాడు. ఐపీఎల్ ఆరంభానికి ముందు ఆల్ స్టార్స్ పేరిట ఛారిటీ మ్యాచ్ నిర్వహించనున్నాం. ఇందులో స్టార్ ప్లేయర్లు పాల్గొననున్నారు. అయితే ఆ మ్యాచ్ వేదికను ఇంకా నిర్ణయించలేదని గంగూలీ పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?