ఈ-సేవతో సౌదీస్ కు బెటర్ సర్వీస్...ఈజీగా ఇండియా వీసా పొందే ఛాన్స్
- January 28, 2020
సౌదీ అరేబియా:ఇండియా విజిట్ చేసే సౌదీస్ కి ఈ-సేవ సర్వీస్ తో మునుపెన్నడూ లేనంత ఈజీగా, చౌకగా వీసా పొందొచ్చు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ గత ఏడాది ఫిబ్రవరిలో భారత్ లో పర్యటించిన సందర్భంగా ఈ-సేవ సర్వీస్ ప్రకటించిన విషయం తెలిసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపరిచేలా తీసుకొచ్చిన ఈ-సేవ సర్వీస్ గత జూన్ 17 నుంచి ప్రారంభమైంది. దీంతో ఇండియాకు వెళ్లే సౌదీస్ కి టూరిస్ట్, బిజినెస్, మెడికల్, కాన్ఫరెన్స్ వీసాలను ఈ-సేవ ద్వారా పొందే వెసులుబాటు ఏర్పడింది. సౌదీ-భారత్ బంధాన్ని బరింత బలపరిచేలా ఇక ఇప్పుడు ఈ-సేవ సర్వీస్ లో ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వీసా ఫీజులో రాయితీలు ప్రకటించింది. వన్ ఇయర్ మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా కాస్ట్ ను 80 డాలర్ల నుంచి 40 అమెరికన్ డాలర్లకు తగ్గించింది. ఒక నెలలో డబుల్ విజిట్ చేసే షార్ట్ టర్మ్ వీసా 25 డాలర్లు, ఏప్రిల్- జూన్ మధ్య
జారీ చేసే వీసాలకు 10 అమెరికన్ డాలర్ల ఛార్జ్ చేయనుంది. ఫైవ్ ఇయర్స్ మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా కాస్ట్ ను 80 అమెరికన్ డాలర్లుగా నిర్ధారించింది. ఈ-సేవ ద్వారా వీసా పొందాలనుకునే వారు ట్రావెల్ డేట్ కు నాలుగు రోజుల ముందు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ-సేవ వీసాలతో పాటు పేపర్ వర్క్ ద్వారా పొందే మాన్యువల్ వీసాలు ఇండియన్ ఎంబసీ కొనసాగించింది. లాస్ట్ ఇయర్ సౌదీస్ కి 19,116 ఈ- సేవ వీసాలు, 18, 598 పేపర్ వీసాలను మంజూరు చేసింది.
ఈ-వీసా కు సంబంధించి https://indianvisaonline.gov.in/evisa/tvoa.html. ద్వారా మరింత సమాచారం పొందవచ్చు.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







