ఈ-సేవతో సౌదీస్ కు బెటర్ సర్వీస్...ఈజీగా ఇండియా వీసా పొందే ఛాన్స్
- January 28, 2020
సౌదీ అరేబియా:ఇండియా విజిట్ చేసే సౌదీస్ కి ఈ-సేవ సర్వీస్ తో మునుపెన్నడూ లేనంత ఈజీగా, చౌకగా వీసా పొందొచ్చు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ గత ఏడాది ఫిబ్రవరిలో భారత్ లో పర్యటించిన సందర్భంగా ఈ-సేవ సర్వీస్ ప్రకటించిన విషయం తెలిసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపరిచేలా తీసుకొచ్చిన ఈ-సేవ సర్వీస్ గత జూన్ 17 నుంచి ప్రారంభమైంది. దీంతో ఇండియాకు వెళ్లే సౌదీస్ కి టూరిస్ట్, బిజినెస్, మెడికల్, కాన్ఫరెన్స్ వీసాలను ఈ-సేవ ద్వారా పొందే వెసులుబాటు ఏర్పడింది. సౌదీ-భారత్ బంధాన్ని బరింత బలపరిచేలా ఇక ఇప్పుడు ఈ-సేవ సర్వీస్ లో ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వీసా ఫీజులో రాయితీలు ప్రకటించింది. వన్ ఇయర్ మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా కాస్ట్ ను 80 డాలర్ల నుంచి 40 అమెరికన్ డాలర్లకు తగ్గించింది. ఒక నెలలో డబుల్ విజిట్ చేసే షార్ట్ టర్మ్ వీసా 25 డాలర్లు, ఏప్రిల్- జూన్ మధ్య
జారీ చేసే వీసాలకు 10 అమెరికన్ డాలర్ల ఛార్జ్ చేయనుంది. ఫైవ్ ఇయర్స్ మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా కాస్ట్ ను 80 అమెరికన్ డాలర్లుగా నిర్ధారించింది. ఈ-సేవ ద్వారా వీసా పొందాలనుకునే వారు ట్రావెల్ డేట్ కు నాలుగు రోజుల ముందు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ-సేవ వీసాలతో పాటు పేపర్ వర్క్ ద్వారా పొందే మాన్యువల్ వీసాలు ఇండియన్ ఎంబసీ కొనసాగించింది. లాస్ట్ ఇయర్ సౌదీస్ కి 19,116 ఈ- సేవ వీసాలు, 18, 598 పేపర్ వీసాలను మంజూరు చేసింది.
ఈ-వీసా కు సంబంధించి https://indianvisaonline.gov.in/evisa/tvoa.html. ద్వారా మరింత సమాచారం పొందవచ్చు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







