జయప్రద ప్రధాన పాత్రలో 'శరభ'. చిత్రం

- January 19, 2016 , by Maagulf
జయప్రద ప్రధాన పాత్రలో  'శరభ'.  చిత్రం

జయప్రద ప్రధాన పాత్రలో ఎ.కె.యస్‌.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'శరభ'. ఆకాష్‌ సహదేవ్‌, మిస్తి చక్రవర్తి నాయకానాయికలు. నరసింహారావు.ఎన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వనీకుమార్‌ సహదేవ్‌ నిర్మాత. 108 నరసింహస్వామి పుణ్యక్షేత్రాల్లో ఒకేసారి సినిమాని ప్రారంభించినట్టు చిత్రబృందం తెలిపింది.దర్శకుడు మాట్లాడుతూ ''సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే ఒక కాన్సెప్ట్‌ చిత్రమ''ని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ''నరసింహస్వామి చరిత్రలోని ఓ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. దర్శకుడు కొత్త తరహా కథ, కథనాల్ని సిద్ధం చేశాడు. శంకర్‌ దగ్గర 20 ఏళ్లపాటు పనిచేసిన అనుభవంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఈ నెల 21 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలుపెడతామ''న్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com