జయప్రద ప్రధాన పాత్రలో 'శరభ'. చిత్రం
- January 19, 2016
జయప్రద ప్రధాన పాత్రలో ఎ.కె.యస్.ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'శరభ'. ఆకాష్ సహదేవ్, మిస్తి చక్రవర్తి నాయకానాయికలు. నరసింహారావు.ఎన్ దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మాత. 108 నరసింహస్వామి పుణ్యక్షేత్రాల్లో ఒకేసారి సినిమాని ప్రారంభించినట్టు చిత్రబృందం తెలిపింది.దర్శకుడు మాట్లాడుతూ ''సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే ఒక కాన్సెప్ట్ చిత్రమ''ని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ''నరసింహస్వామి చరిత్రలోని ఓ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. దర్శకుడు కొత్త తరహా కథ, కథనాల్ని సిద్ధం చేశాడు. శంకర్ దగ్గర 20 ఏళ్లపాటు పనిచేసిన అనుభవంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఈ నెల 21 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలుపెడతామ''న్నారు.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









