పనస బూరెలు
- January 19, 2016
కావలసిన పదార్థాలు: పనసపండు తొనల ముక్కలు (గింజలు లేకుండా) - 2 కప్పులు, బొంబాయి రవ్వ - 1 కప్పు, పచ్చికొబ్బరి కోరు - 2 టీ స్పూన్లు, జీడిపప్పులు - 10, ఉప్పు - చిటికెడు, బెల్లం తురుము - 200 గ్రా., నూనె - వేగించడానికి సరిపడా.
తయారు చేసే విధానం: పనస తొనలు, కొబ్బరి కోరు, బెల్లం తురుము ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ గ్రైండు చేసుకోవాలి. ఈ మిశ్రమంలో బొంబాయి రవ్వ, ముక్కలు చేసుకున్న జీడిపప్పులు, ఉప్పు వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పావుగంట పాటు ఫ్రిజ్లో లేదా చల్లని ప్రదేశంలో పెట్టాలి. తర్వాత గోలీకాయంత సైజులో ఉండలుగా చేసుకుని నూనెలో దోరగా వేగించుకోవాలి. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









