పనస బూరెలు
- January 19, 2016
కావలసిన పదార్థాలు: పనసపండు తొనల ముక్కలు (గింజలు లేకుండా) - 2 కప్పులు, బొంబాయి రవ్వ - 1 కప్పు, పచ్చికొబ్బరి కోరు - 2 టీ స్పూన్లు, జీడిపప్పులు - 10, ఉప్పు - చిటికెడు, బెల్లం తురుము - 200 గ్రా., నూనె - వేగించడానికి సరిపడా.
తయారు చేసే విధానం: పనస తొనలు, కొబ్బరి కోరు, బెల్లం తురుము ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ గ్రైండు చేసుకోవాలి. ఈ మిశ్రమంలో బొంబాయి రవ్వ, ముక్కలు చేసుకున్న జీడిపప్పులు, ఉప్పు వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పావుగంట పాటు ఫ్రిజ్లో లేదా చల్లని ప్రదేశంలో పెట్టాలి. తర్వాత గోలీకాయంత సైజులో ఉండలుగా చేసుకుని నూనెలో దోరగా వేగించుకోవాలి. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









