పనస బూరెలు
- January 19, 2016
కావలసిన పదార్థాలు: పనసపండు తొనల ముక్కలు (గింజలు లేకుండా) - 2 కప్పులు, బొంబాయి రవ్వ - 1 కప్పు, పచ్చికొబ్బరి కోరు - 2 టీ స్పూన్లు, జీడిపప్పులు - 10, ఉప్పు - చిటికెడు, బెల్లం తురుము - 200 గ్రా., నూనె - వేగించడానికి సరిపడా.
తయారు చేసే విధానం: పనస తొనలు, కొబ్బరి కోరు, బెల్లం తురుము ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ గ్రైండు చేసుకోవాలి. ఈ మిశ్రమంలో బొంబాయి రవ్వ, ముక్కలు చేసుకున్న జీడిపప్పులు, ఉప్పు వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పావుగంట పాటు ఫ్రిజ్లో లేదా చల్లని ప్రదేశంలో పెట్టాలి. తర్వాత గోలీకాయంత సైజులో ఉండలుగా చేసుకుని నూనెలో దోరగా వేగించుకోవాలి. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







