10,000 మందికి పైగా టూరిస్టుల్ని తీసుకొచ్చిన 3 క్రూజ్ షిప్‌లు

- January 29, 2020 , by Maagulf
10,000 మందికి పైగా టూరిస్టుల్ని తీసుకొచ్చిన 3 క్రూజ్ షిప్‌లు

ఒమన్‌:ముసందామ్‌లోని ఒమన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ అధికారి ఒకరు మాట్లాడుతూ, జనవరి 16న ఎంఎస్‌సి బెల్లిస్సిమా షిప్‌, కసబ్‌ పోర్టుని సందర్శించిందనీ, ఇందులో 4,527 మంది ప్రయాణీకులు, 1,599 మంది సిబ్బంది వున్నారని తెలిపారు. కాగా, జనవరి 22న మేన్‌ షిఫ్‌ 5, కసబ్‌ పోర్టు వద్ద డాక్‌ అయ్యింది. దీంట్లో 2,487 మంది ప్రయాణీకులు, 995 మంది సిబ్బంది వున్నారు. ఎంవి హారిజాన్‌ షిప్‌, 555 మంది ప్రయాణీకులు 628 మంది క్రూ మెంబర్స్‌తో జనవరి 24న డాక్‌ అయ్యింది. 2018-19 వింటర్‌ సీజన్‌లో కసబ్‌ పోర్ట్‌, 63 షిప్స్‌కి ఆతిథ్యం ఇచ్చిందనీ, వీటి ద్వారా 134,404 మంది ప్రయాణీకులు వచ్చారనీ ముసందమ్‌ చాంబర్‌ టూరిజం స్టేషన్‌ వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com