హైదరాబాద్:మెట్రో ప్రయాణీకులకు శుభవార్త..!
- January 30, 2020
హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ కొత్తగా కారు, బైక్ పూలింగ్ సర్వీస్ను ప్రారంభించింది. దీని కోసం రెడ్బస్ సంస్థతో డీల్ కుదుర్చుకుంది. సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. 'ప్రయాణీకులు తమ గమ్యస్థలాలకు వెళ్లడం కోసం ఈ సర్వీసులు రెడ్బస్తో అనుసంధానం అయిన 'ఆర్-పూల్' అనే రైడ్ షేరింగ్ యాప్ ద్వారా పొందవచ్చునని చెప్పారు.
ఇక ఈ కారు/బైక్ పూలింగ్ వల్ల ట్రాఫిక్ రద్దీని తగ్గించే అవకాశం ఉంటుందని.. ఆఫీసులకు వెళ్లేవారికి ఇది మరింత సౌకర్యాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. ఈ విధానం ద్వారా ఎక్కువగా ఉన్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో ప్రయాణించడానికి ఒక కిలోమీటర్కు కేవలం రూ.2 చెల్లిస్తే సరిపోతుందని మెట్రో సంస్థ ఎండీ తెలిపారు. ఇక వీటి కోసం ప్రతీ మెట్రో స్టేషన్ దగ్గర కొంత స్థలం కేటాయించామన్నారు. కాగా, 'ఆర్-పూల్' కస్టమర్లకు సుమారు 1,000 మెట్రో స్మార్ట్ కార్డులను కూడా అందిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







