హోటల్ గెస్ట్ని కోర్టుకీడ్చిన వాటర్ బాటిల్ గొడవ
- January 30, 2020
యూఏఈలో ఓ గల్ఫ్ సిటిజన్ వాటర్ బాటిల్ గొడవ కారణంగా కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే, గల్ఫ్ సిటిజన్ ఒకరు, ఓ హోటల్లో ఆసియాకి చెందిన రిసెప్షనిస్ట్తో వాటర్ బాటిల్ కోసం గొడవ పడ్డాడు. హైపర్ టెన్షన్తో బాధపడుతున్న గల్ఫ్ సిటిజన్, మందులు వేసుకోవడం కోసం వాటర్ బాటిల్ కావాలంటూ రిసెప్షనిస్ట్కి ఫోన్ చేస్తే, సదరు రిసెప్షనిస్ట్ స్పందించలేదు. దాంతో, విషయం తెలుసుకునేందుకు రిసెప్షనిస్ట్ వద్దకు గల్ఫ్ సిటిజన్ వెళ్ళారు. వరుసగా ఫోన్ కాల్స్ అటెండ్ చేయాల్సి వచ్చినందున వాటర్ బాటిల్ పంపించలేకపోయినట్లు రిసెప్షనిస్ట్ చెబితే, ఆ సమాధానం గల్ఫ్ సిటిజన్కి నచ్చలేదు. హోటల్ మేనేజర్తో మాట్లాడతానని గల్ఫ్ సిటిజన్ కోరగా, ఆ అభ్యర్థనని కూడా రిసెప్షనిస్ట్ పట్టించుకోలేదట. దాంతో, రిసెప్షనిస్ట్ చొక్కా పట్టుకున్నారు గల్ఫ్ సిటిజన్. దాంతో, గల్ఫ్ సిటిజన్పై కేసు నమోదయ్యింది. తాను రిసెప్షనిస్ట్పై దాడి చేయలేదని గల్ఫ్ సిటిజన్ కోర్టులో తన వాదనను విన్పించారు. ఈ కేసు విచారణ వాయిదా పడింది.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..







