హోటల్ గెస్ట్ని కోర్టుకీడ్చిన వాటర్ బాటిల్ గొడవ
- January 30, 2020
యూఏఈలో ఓ గల్ఫ్ సిటిజన్ వాటర్ బాటిల్ గొడవ కారణంగా కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే, గల్ఫ్ సిటిజన్ ఒకరు, ఓ హోటల్లో ఆసియాకి చెందిన రిసెప్షనిస్ట్తో వాటర్ బాటిల్ కోసం గొడవ పడ్డాడు. హైపర్ టెన్షన్తో బాధపడుతున్న గల్ఫ్ సిటిజన్, మందులు వేసుకోవడం కోసం వాటర్ బాటిల్ కావాలంటూ రిసెప్షనిస్ట్కి ఫోన్ చేస్తే, సదరు రిసెప్షనిస్ట్ స్పందించలేదు. దాంతో, విషయం తెలుసుకునేందుకు రిసెప్షనిస్ట్ వద్దకు గల్ఫ్ సిటిజన్ వెళ్ళారు. వరుసగా ఫోన్ కాల్స్ అటెండ్ చేయాల్సి వచ్చినందున వాటర్ బాటిల్ పంపించలేకపోయినట్లు రిసెప్షనిస్ట్ చెబితే, ఆ సమాధానం గల్ఫ్ సిటిజన్కి నచ్చలేదు. హోటల్ మేనేజర్తో మాట్లాడతానని గల్ఫ్ సిటిజన్ కోరగా, ఆ అభ్యర్థనని కూడా రిసెప్షనిస్ట్ పట్టించుకోలేదట. దాంతో, రిసెప్షనిస్ట్ చొక్కా పట్టుకున్నారు గల్ఫ్ సిటిజన్. దాంతో, గల్ఫ్ సిటిజన్పై కేసు నమోదయ్యింది. తాను రిసెప్షనిస్ట్పై దాడి చేయలేదని గల్ఫ్ సిటిజన్ కోర్టులో తన వాదనను విన్పించారు. ఈ కేసు విచారణ వాయిదా పడింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









