హోటల్ గెస్ట్ని కోర్టుకీడ్చిన వాటర్ బాటిల్ గొడవ
- January 30, 2020
యూఏఈలో ఓ గల్ఫ్ సిటిజన్ వాటర్ బాటిల్ గొడవ కారణంగా కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే, గల్ఫ్ సిటిజన్ ఒకరు, ఓ హోటల్లో ఆసియాకి చెందిన రిసెప్షనిస్ట్తో వాటర్ బాటిల్ కోసం గొడవ పడ్డాడు. హైపర్ టెన్షన్తో బాధపడుతున్న గల్ఫ్ సిటిజన్, మందులు వేసుకోవడం కోసం వాటర్ బాటిల్ కావాలంటూ రిసెప్షనిస్ట్కి ఫోన్ చేస్తే, సదరు రిసెప్షనిస్ట్ స్పందించలేదు. దాంతో, విషయం తెలుసుకునేందుకు రిసెప్షనిస్ట్ వద్దకు గల్ఫ్ సిటిజన్ వెళ్ళారు. వరుసగా ఫోన్ కాల్స్ అటెండ్ చేయాల్సి వచ్చినందున వాటర్ బాటిల్ పంపించలేకపోయినట్లు రిసెప్షనిస్ట్ చెబితే, ఆ సమాధానం గల్ఫ్ సిటిజన్కి నచ్చలేదు. హోటల్ మేనేజర్తో మాట్లాడతానని గల్ఫ్ సిటిజన్ కోరగా, ఆ అభ్యర్థనని కూడా రిసెప్షనిస్ట్ పట్టించుకోలేదట. దాంతో, రిసెప్షనిస్ట్ చొక్కా పట్టుకున్నారు గల్ఫ్ సిటిజన్. దాంతో, గల్ఫ్ సిటిజన్పై కేసు నమోదయ్యింది. తాను రిసెప్షనిస్ట్పై దాడి చేయలేదని గల్ఫ్ సిటిజన్ కోర్టులో తన వాదనను విన్పించారు. ఈ కేసు విచారణ వాయిదా పడింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







