రేపే నిర్మలమ్మ బడ్జెట్
- January 31, 2020
న్యూ ఢిల్లీ:కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 (శనివారం) బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. 2019లో అద్భుత మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఇది తొలి పూర్తి బడ్జెట్. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 ఆర్థిక సంవత్సరానికి ఈ బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ప్రవేశ పెడుతున్న ఈ బడ్జెట్ వైపు అన్ని రంగాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.
బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు రోజు ఎకనమిస్ సర్వేను ఉభయ సభల్లో సమర్పిస్తారు. ఈ రోజు (శుక్రవారం, జనవరి 31) దీనిని పార్లమెంటులో ప్రవేశ పెడతారు. జీడీపీ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం ఐదు శాతానికే పరిమితం అవుతుందనే అంచనాల నేపథ్యంలో.. ఆటో రంగం సహా వివిధ రంగాల్లో డిమాండ్ పడిపోయిన సమయంలో ఈ బడ్జెట్ కీలకంగా మారింది. డిమాండ్, వినియోగం పెంచేందుకు ఆదాయపు పన్ను పరిమితులు సహా వివిధ ప్రకటనలు చేస్తారని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!