రేపే నిర్మలమ్మ బడ్జెట్
- January 31, 2020
న్యూ ఢిల్లీ:కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 (శనివారం) బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. 2019లో అద్భుత మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఇది తొలి పూర్తి బడ్జెట్. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 ఆర్థిక సంవత్సరానికి ఈ బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ప్రవేశ పెడుతున్న ఈ బడ్జెట్ వైపు అన్ని రంగాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.
బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు రోజు ఎకనమిస్ సర్వేను ఉభయ సభల్లో సమర్పిస్తారు. ఈ రోజు (శుక్రవారం, జనవరి 31) దీనిని పార్లమెంటులో ప్రవేశ పెడతారు. జీడీపీ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం ఐదు శాతానికే పరిమితం అవుతుందనే అంచనాల నేపథ్యంలో.. ఆటో రంగం సహా వివిధ రంగాల్లో డిమాండ్ పడిపోయిన సమయంలో ఈ బడ్జెట్ కీలకంగా మారింది. డిమాండ్, వినియోగం పెంచేందుకు ఆదాయపు పన్ను పరిమితులు సహా వివిధ ప్రకటనలు చేస్తారని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









