విమానంలోనే కన్నుమూసిన ఏ.పి వ్యక్తి
- January 31, 2020
తిరుపతి:కువైట్ నుంచి బయలుదేరిన శ్రీనివాసులు బాలాజీ (45) విమానంలోనే గుండెపోటుతో అసువులు బాశారు. దీంతో దామినేడులో విషాదం నెలకొంది. తిరుపతి దామినేడుకు చెందిన బాలాజీ డ్రైవర్ పనిచేస్తూ ఉపాధి కోసం పదేళ్ల కిందట కువైట్ వెళ్లారు. ఈయన భార్య జయలక్ష్మి కూడా నాలుగేళ్ల క్రితం భర్త వద్దకే వెళ్లారు. తమ ఇద్దరు కుమార్తెలను తల్లిదండ్రుల వద్దే బాలాజీ ఉంచారు. తన బిడ్డలను చూడాలని బుధవారం సాయంత్రం ఆయన కువైట్ నుంచి విమానంలో చెన్నైకి బయలుదేరారు. విమానంలో ఉన్న సమయంలోనే బాలాజీకి గుండెపోటు వచ్చింది. దీంతో ఎయిర్హోస్టెస్లు ప్రథమ చికిత్స అందించారు. ఆయనకు గుండెపోటు రావడంతో సాధారణంగా గురువారం వేకువజామున 1.30 గంటలకు చెన్నై చేరుకోవాల్సిన విమానం.. ముందుగానే ల్యాండ్ అయ్యేలా ఉత్తర్వులు జారీచేయడంతో 12.50 గంటలకే వచ్చింది.
వెంటనే వైద్య బృందం బాలాజీని పరీక్షించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. కువైట్లోని భారత రాయబార కార్యాలయానికి, దామినేడులోని మృతుడి తల్లిదండ్రులకు విమానాశ్రయ అధికారులు సమాచారమిచ్చారు. కాగా, బాలాజీని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లిన సమీప బంధువులు సుబ్రహ్మణ్యం, రాజశేఖర్.. చివరికి మృతదేహాన్ని తీసుకుని గురువారం సాయంత్రం ఇంటికి వచ్చారు. మృతుడి భార్య జయలక్ష్మి కూడా కువైట్ నుంచి బయలుదేరారు. మరికొన్ని గంటల్లో ఇంటికి చేరుకుంటాడన్న తమ కుమారుడు శవమై తిరిగి రావడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. తమ తండ్రి నిర్జీవంగా రావడంతో కుమార్తెలు భోరున విలపిస్తున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







