టెక్ దిగ్గజం ఐబీఎం సీఈఓగా అరవింద్ కృష్ణ
- January 31, 2020టెనాలజీ దిగ్గజం ఐబీఎం నూతన సీఈఓగా భారత సంతతికి చెందిన అరవింద్ కృష్ణ (57) ఎన్నికయ్యారు. ఐబీఎం బోర్డు అఫ్ డైరెక్టర్లు ఆయనను తదుపరి సీఈఓగా ఎన్నుకున్నట్టు ఐబీఎం ప్రకటించింది. ఏప్రిల్ 6 నుంచి నూతన సీఈఓగా అరవింద్ కృష్ణ బాధ్యతలు చేపడతారని పేర్కొంది. ప్రస్తుతం సీఈఓగా ఉన్న గిన్నీ రోమెట్టీ ఏ ఏడాది రిటైర్ కానున్నారు, ప్రస్తుతం ఆమె ఐబీఎం చైర్మన్ గా కొనసాగుతున్నారు. కృష్ణ 1990 లో ఐబీఎంలో చేరారు.
కాన్పూర్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డి చేశారు. ఐబీఎం సీఈఓ గా ఎన్నిక కావడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు కృష్ణ. 'ఐబిఎమ్ యొక్క తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎన్నుకోబడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది, గిన్ని మరియు బోర్డు నాలో ఉంచిన విశ్వాసాన్ని గౌరవిస్తాను' అని కృష్ణ ఐబిఎం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ