నిర్భయ కేసులో ట్విస్ట్..
- January 31, 2020న్యూ ఢిల్లీ:నిర్భయ కేసులో మళ్లీ ట్విస్ట్ ఎదురైంది. నిర్భయ దోషుల ఉరి రోజుకో మలుపు తిరుగుతోంది. నలుగురు దోషుల క్షమాభిక్ష పిటీషన్ను రాష్ట్రపతి మూడు రోజుల కిందే తిరస్కరించారు. దీంతో ఆ దోషులను శనివారం ఉరి తీయడం దాదాపు ఖాయమనే అనుకున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా అయ్యాయి. తలారి సైతం తీహార్ జైలుకు చేరుకున్నారు. ఉదయం నలుగురుకీ ఉరిశిక్ష ఖాయం అనుకున్నారు అంతా.. అయితే రాష్ట్రపతి క్షమాభిక్షను కోరుతూ వినయ్ శర్మ పిటీషన్ను దాఖలు చేశాడు. ఆ పిటీషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది. వినయ్ శర్మ పిటీషన్ పెండింగ్లో ఉన్నందున అతడి ఉరి శిక్ష వాయిదా పడుతుందని తీహార్ జైలు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇర్ఫాన్ అహ్మద్ అన్నారు. ఇందులో వేరే ఉద్దేశమేది లేదని ఆయన అన్నారు. కాగా.. మిగతా దోషులను ముందు అనుకున్నట్లుగానే జైలు అధికారులు ఉరి తీస్తారని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…