పలు దేశాలకు చెందిన డిగ్రీలను తిరస్కరించిన మినిస్ట్రీ
- January 31, 2020
మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇండియా, యూఎస్ మరియు యూకేలకు చెందిన కొన్ని డిగ్రీలను తిరస్కరించింది. సైన్స్ విభాగంలో బయో టెక్నాలజీకి సంబంధించి మాస్టర్స్ అలాగే బ్యాచిలర్స్ డిగ్రీలను తిరస్కరించడం జరిగింది. ఇండియాలోని రామ్ మనోహర్ లోహియా అవద్ యూనివర్సిటీకి చెందిన డిగ్రీలు, సంబంధిత టెర్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ పరిధిలో లేవని మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తేల్చి చెప్పింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి సంబంధించిన ఫిలాసఫీ పీహెచ్డీని కూడా తిరస్కరించడం గమనార్హం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందిన ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ జారీ చేసిన మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎయిర్ నావిగేషన్ని కూడా తిరస్కరించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







