కరోనా వైరస్తో స్కూళ్ళు మూతపడలేదు
- January 31, 2020
యూ.ఏ.ఈ:ఫిబ్రవరి 2 నుంచి కొన్ని స్కూళ్ళు కరోనా వైరస్ తీవ్రత కారణంగా మూతపడనున్నట్లు సర్క్యులేట్ అవుతున్న వార్తలో నిజం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అనేక పుకార్లు కూడా ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా యూఏఈలోకి వైరస్ ప్రవేశించిందనీ, దాంతో స్కూళ్ళకు సెలవులు ప్రకటించారనీ ఓ ఫేక్ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. కాగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించింది కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







