కరోనా అలర్ట్ :వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీ విధించిన WHO
- February 01, 2020
చైనా నుంచి ప్రపంచ దేశాలకు ర్యాపిడ్ గా విస్తరిస్తున్న కరోనా వైరస్ పట్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రమత్తం అయ్యింది. అంతకంతకూ విస్తరణకు కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇప్పటివరకు భారత్ తో 20 దేశాలకు వైరస్ విస్తరించినట్లు WHO తెలిపింది. దీంతో అయా దేశాలకు వైరస్ ను అరికట్టేందుకు సత్వరమే తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రపంచ దేశాలు సంయుక్తంగా పోరాడేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రకటించింది. ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటుతో పాటు సరపడా కరోనా కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని కోరింది. కరోనా ధాటికి చైనాలో ఇప్పటికే 213 మంది చనిపోగా..ప్రపంచవ్యాప్తంగా 10 వేల మందికి వైరస్ సోకంది. ఇదంతా కేవలం రెండు వారాల వ్యవధిలో జరిగింది. దీంతో వైరస్ తీవ్రతను అసాధారణ పరిస్థితులుగా గుర్తిస్తూ WHO వర్లడ్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఇక లేటెస్ట్ గా బ్రిటన్ లో కూడా రెండు కరోనా కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







