కరోనా అలర్ట్ :వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీ విధించిన WHO
- February 01, 2020
చైనా నుంచి ప్రపంచ దేశాలకు ర్యాపిడ్ గా విస్తరిస్తున్న కరోనా వైరస్ పట్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రమత్తం అయ్యింది. అంతకంతకూ విస్తరణకు కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇప్పటివరకు భారత్ తో 20 దేశాలకు వైరస్ విస్తరించినట్లు WHO తెలిపింది. దీంతో అయా దేశాలకు వైరస్ ను అరికట్టేందుకు సత్వరమే తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రపంచ దేశాలు సంయుక్తంగా పోరాడేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రకటించింది. ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటుతో పాటు సరపడా కరోనా కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని కోరింది. కరోనా ధాటికి చైనాలో ఇప్పటికే 213 మంది చనిపోగా..ప్రపంచవ్యాప్తంగా 10 వేల మందికి వైరస్ సోకంది. ఇదంతా కేవలం రెండు వారాల వ్యవధిలో జరిగింది. దీంతో వైరస్ తీవ్రతను అసాధారణ పరిస్థితులుగా గుర్తిస్తూ WHO వర్లడ్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఇక లేటెస్ట్ గా బ్రిటన్ లో కూడా రెండు కరోనా కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







