మిడతలపై పోరుకు సిద్ధమవుతున్న పాక్
- February 03, 2020
భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాల రైతులకు కొత్త సమస్య వచ్చిపడింది. పాకిస్థాన్ నుంచి భారత్ వైపు దూసుకువస్తున్న మిడతలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. చేతికొచ్చిన పంటను మిడతల దండు కత్తిరించి వేస్తున్నాయి. పాక్ లోని పంజాబ్ ఫ్రావిన్స్ నుంచి భారత భూభాగంలోకి వస్తున్నట్లు గుర్తించారు. పంజాబ్తో పాటూ రాజస్థాన్లోని 12 జిల్లాల్లో మిడతల ప్రభావం ఎక్కువగా ఉంది. అటు పాకిస్థాన్ లో కూడా మిడతల దండు బీభత్సం సృష్టిస్తోంది..దీనిపై ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించింది పాక్ ప్రభుత్వం.
ఇటు మిడతల దండును తరిమేందుకు రైతులు పెద్ద శబ్దంతో పాటలు పెట్టడం, ఫైర్ ట్యాంకర్ల సాయంతో కెమికల్స్ స్ర్పే చేయడం వంటి నివారణ చర్యలు పాటిస్తున్నారు. ఇక మిడతలపై పొరుకు పాక్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సర్కారు జాతీయ సత్వర ప్రణాళికకు 730 కోట్లు కేటాయించింది.. మిడతల సమస్య నుంచి రైతులను బయటపడేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశించారు. మిడతల దాడితో సింధ్ ప్రావిన్స్ లో పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







