యూఏఈకి చేరుకున్న ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ షిప్‌ సముద్ర పెహెరెదర్‌

- February 03, 2020 , by Maagulf
యూఏఈకి చేరుకున్న ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ షిప్‌ సముద్ర పెహెరెదర్‌

 

దుబాయ్:భారత కోస్ట్‌ గార్డ్‌ షిప్‌ (ఐసిజిఎస్‌) సముద్ర పెహెరదర్‌, యూఏఈకి చేరుకుంది. మినా రషిద్‌లో ఈ షిప్‌ డాక్‌ అయి వుంది. మూడు రోజుల గుడ్‌ విల్‌ విజిట్‌లో భాగంగా ఈ షిప్‌ యూఏఈకి చేరుకోవడం జరిగింది. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల్ని ఈ తరహా కార్యక్రమాలు మరింత పటిష్టం చేసేందుకు ఉపకరిస్తాయని ఇరు దేశాల ప్రతినిథులు అభిప్రాయపడుతున్నారు. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ (ఐసిసి) అలాగే యూఏఈ మెరిటైమ్‌ ఏజెన్సీస్‌ సంయుక్తంగా పలు కార్యక్రమాల్ని ఇప్పటికే చేపట్టాయి. కాగా, ఐసిజిఎస్‌ సముద్ర పెహెరెదర్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ వెజెల్‌ కేటగిరీలో భారతదేశానికి చెందిన రెండవ నౌక. 2010లో ఈ నౌకని కమిషన్‌ చేశారు. సూరత్‌లోని ఎబిజి షిప్‌యార్డ్‌లో దీన్ని తయారు చేశారు. 20 రోజులపాటు పూర్తిగా సముద్రంలోనే ఈ నౌక వుండగలదు.ఈ షిప్ కి అన్వర్ ఖాన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com