యూఏఈకి చేరుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సముద్ర పెహెరెదర్
- February 03, 2020



దుబాయ్:భారత కోస్ట్ గార్డ్ షిప్ (ఐసిజిఎస్) సముద్ర పెహెరదర్, యూఏఈకి చేరుకుంది. మినా రషిద్లో ఈ షిప్ డాక్ అయి వుంది. మూడు రోజుల గుడ్ విల్ విజిట్లో భాగంగా ఈ షిప్ యూఏఈకి చేరుకోవడం జరిగింది. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల్ని ఈ తరహా కార్యక్రమాలు మరింత పటిష్టం చేసేందుకు ఉపకరిస్తాయని ఇరు దేశాల ప్రతినిథులు అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసిసి) అలాగే యూఏఈ మెరిటైమ్ ఏజెన్సీస్ సంయుక్తంగా పలు కార్యక్రమాల్ని ఇప్పటికే చేపట్టాయి. కాగా, ఐసిజిఎస్ సముద్ర పెహెరెదర్, పొల్యూషన్ కంట్రోల్ వెజెల్ కేటగిరీలో భారతదేశానికి చెందిన రెండవ నౌక. 2010లో ఈ నౌకని కమిషన్ చేశారు. సూరత్లోని ఎబిజి షిప్యార్డ్లో దీన్ని తయారు చేశారు. 20 రోజులపాటు పూర్తిగా సముద్రంలోనే ఈ నౌక వుండగలదు.ఈ షిప్ కి అన్వర్ ఖాన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.




తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







