యూఏఈకి చేరుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సముద్ర పెహెరెదర్
- February 03, 2020



దుబాయ్:భారత కోస్ట్ గార్డ్ షిప్ (ఐసిజిఎస్) సముద్ర పెహెరదర్, యూఏఈకి చేరుకుంది. మినా రషిద్లో ఈ షిప్ డాక్ అయి వుంది. మూడు రోజుల గుడ్ విల్ విజిట్లో భాగంగా ఈ షిప్ యూఏఈకి చేరుకోవడం జరిగింది. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల్ని ఈ తరహా కార్యక్రమాలు మరింత పటిష్టం చేసేందుకు ఉపకరిస్తాయని ఇరు దేశాల ప్రతినిథులు అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసిసి) అలాగే యూఏఈ మెరిటైమ్ ఏజెన్సీస్ సంయుక్తంగా పలు కార్యక్రమాల్ని ఇప్పటికే చేపట్టాయి. కాగా, ఐసిజిఎస్ సముద్ర పెహెరెదర్, పొల్యూషన్ కంట్రోల్ వెజెల్ కేటగిరీలో భారతదేశానికి చెందిన రెండవ నౌక. 2010లో ఈ నౌకని కమిషన్ చేశారు. సూరత్లోని ఎబిజి షిప్యార్డ్లో దీన్ని తయారు చేశారు. 20 రోజులపాటు పూర్తిగా సముద్రంలోనే ఈ నౌక వుండగలదు.ఈ షిప్ కి అన్వర్ ఖాన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.




తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







