కరోనా ఎఫెక్ట్ : ఫాల్స్ న్యూస్ ప్రచారం చేస్తే 5 ఏళ్ల జైలు శిక్ష
- February 04, 2020
కువైట్:కరోనా వైరస్ పై తెలిసితెలియక జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు కువైట్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇక నుంచి వైరస్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుడు ప్రచారం చేసిన జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. దీనిపై ఎవరు కంప్లైంట్ చేయకున్నా..సుమోటోగా కేసు నమోదు చేసి జైలు పంపించే వెసులుబాటు ఉందని అధికారులు గుర్తుచేశారు. దాదాపు 5 ఏళ్ల వరకు జైలు శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. కరోనా వ్యాప్తిపై గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికగా కువైట్ లో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. వైరస్ తో కొందరు ఇప్పటికే ఆస్పత్రి పాలయ్యారని కొన్ని అకౌంట్లలో కనిపించగా...వైరస్ అతి సాధరణమైనదనే తరహాలో మరికొన్ని అకౌంట్లలో పోస్టింగ్ లు గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కువైట్ పోలీసులు తాజా హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే విధంగా లేదా వారిని అయోమయానికి గురిచేసే విధంగా జరుగుతున్న ఈ ఫేక్ న్యూస్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!