కరోనా ఎఫెక్ట్ : ఫాల్స్ న్యూస్ ప్రచారం చేస్తే 5 ఏళ్ల జైలు శిక్ష
- February 04, 2020
కువైట్:కరోనా వైరస్ పై తెలిసితెలియక జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు కువైట్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇక నుంచి వైరస్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుడు ప్రచారం చేసిన జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. దీనిపై ఎవరు కంప్లైంట్ చేయకున్నా..సుమోటోగా కేసు నమోదు చేసి జైలు పంపించే వెసులుబాటు ఉందని అధికారులు గుర్తుచేశారు. దాదాపు 5 ఏళ్ల వరకు జైలు శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. కరోనా వ్యాప్తిపై గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికగా కువైట్ లో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. వైరస్ తో కొందరు ఇప్పటికే ఆస్పత్రి పాలయ్యారని కొన్ని అకౌంట్లలో కనిపించగా...వైరస్ అతి సాధరణమైనదనే తరహాలో మరికొన్ని అకౌంట్లలో పోస్టింగ్ లు గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కువైట్ పోలీసులు తాజా హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే విధంగా లేదా వారిని అయోమయానికి గురిచేసే విధంగా జరుగుతున్న ఈ ఫేక్ న్యూస్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







