ఎక్స్‌పో 2020 ఇండియన్‌ టీమ్‌కి నవ్‌దీప్‌ సూరి నాయకత్వం

- February 04, 2020 , by Maagulf
ఎక్స్‌పో 2020 ఇండియన్‌ టీమ్‌కి నవ్‌దీప్‌ సూరి నాయకత్వం

న్యూఢిల్లీ: దుబాయ్‌ ఎక్స్‌పో2020 కోసం భారతదేశం తరఫున పాల్గొనే బృందానికి ఒకప్పటి రాయబారి నవ్‌దీప్‌ సూరిని ఎంపిక చేశారు. ఇండియా పెవిలియన్‌, దుబాయ్‌ ఎక్స్‌పో 2020లో ఆకర్షణీయంగా మారబోతోందనీ, భారతదేశం తరఫున అత్యద్భుతమైన రిప్రెజెంటేషన్‌ ఇవ్వబోతున్నామని నవ్‌దీప్‌ సూరి ఈ సందర్భగా అభిప్రాయపడ్డారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌ఐసిసిఐ) ప్రెసిడెంట్‌ డాక్టర్‌ సంగీతారెడ్డి మాట్లాడుతూ, ఇండియన్‌ పెవిలియన్‌లో భారత ఘనతను చాటి చెప్పేలా సూరి నేతృత్వంలో కార్యక్రమాలు వుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. దుబాయ్‌ ఎక్స్‌పో 2020లో ఇండస్ట్రీ పార్టనర్‌గా భారత ప్రభుత్వానికి ఫిక్కీ వ్యవహరిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com