ఎం.ఎస్ రాజు "డర్టీ హరి" రీ-రికార్డింగ్ పనులు మొదలు!!
- February 04, 2020
ప్రముఖ నిర్మాత ఎం.ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న "డర్టీ హరి" చిత్ర రీ-రికార్డింగ్ పనులు మొదలయినట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు.
రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో 'హరి' గా హైదెరాబాదీ కుర్రాడు శ్రవణ్ రెడ్డి పరిచయం అవుతుండగా, జాక్వెలిన్, వసుధ పాత్రల్లో హీరోయిన్లుగా సిమ్రత్ కౌర్ మరియు రుహాణి శర్మ కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన 'డర్టీ హరి' ఫస్ట్ లుక్స్ ఈ చిత్రం ఎంత బోల్డ్ గా ఉండబోతుందో చెబుతుండగా, ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన పేరున్న ప్రొడ్యూసర్/డైరెక్టర్ కి ఇది కంబ్యాక్ చిత్రం అవ్వడంతో భారీ అంచనాల మొదలయ్యాయి.
ఈ సందర్భంగా ఇటీవల జరుగుతున్న రీ-రికార్డింగ్ పనుల్లో భాగంగా తన పాత జ్ఞాపకాల గురించి ఎం.ఎస్ రాజు మాట్లాడుతూ, 1987 లో తన మొదటి సినిమాకి పని చేసిన కే.వి. మహదేవన్, ఆ తరువాత కలిసి ప్రయాణించిన రాజ్ కోటి, కొత్త తరం సంగీత దర్శకులు దేవి శ్రీ ప్రసాద్, మణిశర్మ, చక్రి, కార్తీక్ రాజు మరియు ఇప్పుడు పని చేస్తున్న మార్క్ కే రాబిన్ లని గుర్తుచేసుకుంటూ తన సుదీర్ఘ ప్రయాణాన్ని నెమరువేసుకున్నారు.
అలాగే ఎస్.పి.జె క్రియేషన్స్ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తున్న గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో బోల్డ్నెస్ తో పాటు సున్నితమైన భావోద్వేగభరితమైన సన్నివేశాలు కూడా ఉంటాయని. దర్శకుడు రొమాన్స్ ని చాలా పొయెటిక్ గా చూపిస్తున్నారని అన్నారు. అదే సమయంలో నిర్మాణాంతర కార్యక్రమాలని వేగపరుస్తూ, త్వరలోనే చిత్ర టీజర్ ని మరియు రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!