గల్ఫ్ ప్రవాసి అంతిమయాత్రలో వినూత్న ప్రదర్శన
- February 04, 2020
తెలంగాణ:విదేశాలలో అసువులుబాసిన ప్రవాసీ కార్మికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల మృతధన సహాయం చెల్లించాలని కోరుతూ గ్రామ ప్రజలు, గల్ఫ్ ప్రవాసీలు ఒక గల్ఫ్ కార్మికుడి అంతిమయాత్రలో ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించిన సంఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయిపల్లి గ్రామంలో మంగళవారం (04.02.2020) జరిగింది.
తిప్పాయిపల్లికి చెందిన నరుకుల్ల శ్రీను గత నెల 4న ఖతార్ దేశంలో మృతి చెందగా, సరిగ్గా నెలరోజులకు శవపేటిక స్వగ్రామానికి చేరుకున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగం వారు హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి తిప్పాయిపల్లి వరకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.
ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ నాయకులు స్వదేశ్ పరికిపండ్ల, గజ్జెల అశోక్ ల నాయకత్వంలో ప్రవాసీ అంతిమయాత్ర జరిగింది. గల్ఫ్ ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ లో రూ. 500 కోట్లు కేటాయించాలని, రాష్ట్రం నుండి విదేశాలకు జరిగే వలసలపై ప్రభుత్వం సమగ్రమైన సర్వే నిర్వహించాలని వారు ఈ సందర్బంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







