మస్కట్:కూరగాయల ధరల పెంపుపై PACP సీరియస్..
- February 05, 2020
మస్కట్:కరోనా వైరస్ గల్ఫ్ దేశాలకు చేరకున్నా...దాని ఎఫెక్ట్ మాత్రం వివిధ రంగాల్లో కనిపిస్తోంది. చైనా నుంచి ఫేస్ మాస్క్ ఇంపోర్ట్ తగ్గిపోవటంతో గల్ఫ్ కంట్రీస్ లో ఇప్పటికే మాస్కులకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇక ఇప్పుడు నిత్యావసర సరుకులపైనా ప్రభావం చూపుతోంది. ఒమన్ లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. చైనా నుంచి దిగుమతులు తగ్గిపోవటంతో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. అయితే..కూరగాయల ధరలను అదుపులో ఉంచేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్సూమర్ ప్రొటెక్షన్-PACP సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. దిగుమతులు తగ్గాయనే సాకుతో రేట్లను పెంచొద్దని ఇప్పటికే రిటైల్ ఔట్ లెట్స్, సూపర్ మార్కెట్స్, హైపర్ మార్కెట్స్ కు PACP సూచించింది. పెరిగిన రేట్లపై కస్టమర్స్ నుంచి కంప్లైంట్స్ రావటంతో ధరలను అదుపు చేసేందుకు ప్రస్తుతం చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. చైనా నుంచి అల్లం, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, క్యారెట్ వంటి కూరగాయల దిగుమతి నెల రోజులుగా తగ్గింది. కేవలం డిమాండ్ ను బేస్ చేసుకొని రేట్లను పెంచాలనుకోవటం నేరమే అవుతుందనేది PACP వాదన. కూరగాయల కొరత ఉన్నా రేట్లు పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి లేదని ట్రేడర్స్ కు గుర్తుచేసింది. ప్రస్తుతం చైనా నుంచి కూరగాయల దిగుమతిపై ఎలాంటి నిషేధం లేదని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







