ఆ ఆరుగురు, క్యాన్సర్ని జయించారు
- February 05, 2020
దుబాయ్:క్యాన్సర్ని జయించిన ఆ ఆరుగురు, క్యాన్సర్ అంటే 'మరణ శిక్ష' కానే కాదని నిరూపించారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా వీరంతా తమ అనుభవాల్ని పంచుకున్నారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద జరిగిన ఈవెంట్లో పాల్గొన్న ఆ ఆరుగురిలో ఒకరికి వైద్యులు తొలుత ఏడాది మాత్రమే జీవిస్తుందని చెప్పారు. అయితే, దిషా మోతియానీ మాత్రం తాను క్యాన్సర్ని జయిస్తాననే ధీమా వ్యక్తం చేశారు. ఆ ధైర్యమే ఆమెను గెలిపించింది. ఆమె హిప్ హాప్ డాన్సర్గా పనిచేశారు. 2012లో ఆమెకు క్యాన్సర్ వుందని తేలింది. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసే క్రమంలో, ఏడాది మాత్రమే ఆమె జీవిస్తుందని చెప్పారు. అయితే, ఆమె ఇప్పుడు ఎలాంటి సమస్యా లేకుండా జీవిస్తున్నారు. కాగా, 59 ఏళ్ళ ప్రియాంకా గుప్తా, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆమె క్యాన్సర్ నుంచి కోలుకుని ఫ్యాషన్ డిజైనర్గా రాణిస్తున్నారు. క్యాన్సర్ అంటే జీవితం ముగిసినట్లు కాదిప్పుడు. అత్యాధునిక వైద్య చికిత్సలు అందుబాటులో వున్నాయి. క్యాన్సర్ని జయించడానికి మానసిక స్థయిర్యం కూడా ముఖ్యమే.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







