ఆ ఆరుగురు, క్యాన్సర్ని జయించారు
- February 05, 2020
దుబాయ్:క్యాన్సర్ని జయించిన ఆ ఆరుగురు, క్యాన్సర్ అంటే 'మరణ శిక్ష' కానే కాదని నిరూపించారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా వీరంతా తమ అనుభవాల్ని పంచుకున్నారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద జరిగిన ఈవెంట్లో పాల్గొన్న ఆ ఆరుగురిలో ఒకరికి వైద్యులు తొలుత ఏడాది మాత్రమే జీవిస్తుందని చెప్పారు. అయితే, దిషా మోతియానీ మాత్రం తాను క్యాన్సర్ని జయిస్తాననే ధీమా వ్యక్తం చేశారు. ఆ ధైర్యమే ఆమెను గెలిపించింది. ఆమె హిప్ హాప్ డాన్సర్గా పనిచేశారు. 2012లో ఆమెకు క్యాన్సర్ వుందని తేలింది. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసే క్రమంలో, ఏడాది మాత్రమే ఆమె జీవిస్తుందని చెప్పారు. అయితే, ఆమె ఇప్పుడు ఎలాంటి సమస్యా లేకుండా జీవిస్తున్నారు. కాగా, 59 ఏళ్ళ ప్రియాంకా గుప్తా, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆమె క్యాన్సర్ నుంచి కోలుకుని ఫ్యాషన్ డిజైనర్గా రాణిస్తున్నారు. క్యాన్సర్ అంటే జీవితం ముగిసినట్లు కాదిప్పుడు. అత్యాధునిక వైద్య చికిత్సలు అందుబాటులో వున్నాయి. క్యాన్సర్ని జయించడానికి మానసిక స్థయిర్యం కూడా ముఖ్యమే.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







