కరోనా వైరస్ బాధితులకు యూఏఈలో ఉచిత వైద్యం
- February 06, 2020
దుబాయ్ హెల్త్ అథారిటీ (డిహెచ్ఎ), హాస్పిటల్స్కి సర్క్యులర్ జారీ చేసింది కరోనా వైరస్ విషయమై. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ సూచనల మేరకు డిహెచ్ఎ లైసెన్స్డ్ హెల్త్ ఫెసిలిటీస్ అన్నీ, కరోనా వైరస్ అనుమానిత కేసుల్ని అత్యవసర కేసులుగా డీల్ చేయాల్సి వుంటుంది. అనుమానితులు లేదా బాధితులకు ఇనూన్స్యూరెన్స్ సౌకర్యం వున్నా లేకపోయినా, వారికి ఉచితంగానే వైద్య చికిత్స అందించాలన్నది ఈ డైరెక్టేటివ్స్ సారాంశం. ఇన్స్యూరెన్స్ వున్న పేషెంట్ని ఎమర్జన్సీ విభాగంలో వైద్య చికిత్స అందించాలనీ, సంబంధిత ఇన్స్యూరెన్స్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా క్లెయిమింగ్ ప్రక్రియ వుండాలని పేర్కొన్నారు. ఒకవేళ ఇన్స్యూరెన్స్ లేకపోయినా, బాధితులు ఎలాంటి ఫీజూ చెల్లించాల్సిన అవసరం లేదని మినిస్ట్రీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఐదుగురు కరోనా పాజిటివ్ పేషెంట్లకు యూఏఈలో వైద్య చికిత్స అందుతోంది. వీరిలో నలుగురు యూఏఈలో వుంటోన్న చైనీస్ కుటుంబ సభ్యులు కాగా, మరొకరు చైనా టూరిస్ట్. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే వుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







