అలెర్ట్..అలెర్ట్! యూఏఈ లో మరో రెండు కరోనావైరస్ కేసులు
- February 08, 2020
యూఏఈ: కరోనావైరస్ సంక్రమణకు సంబంధించిన రెండు కొత్త కేసులను యూఏఈ ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఏడుకి చేరుకుంది. తాజాగా వైరస్ సోకివారిలో ఒకరు ఫిలిపినో (మొదటి నాన్ - చైనీస్ వ్యక్తి) మరొకరు చైనీస్ గా గుర్తించారు.
కరోనావైరస్ సంక్రమించే ప్రమాదం ఉన్న రోగులను గుర్తించడానికి ‘ప్రిడిక్టివ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్’ ను గత వారం ప్రారంభించినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ (వారీద్ సిస్టమ్) ను అన్ని హాస్పిటల్స్ లో పొందుపరచటం జరిగిందని తద్వారా కరోనావైరస్ సంక్రమణను పొందే ప్రమాదం ఉన్న వ్యక్తులను త్వరగా గుర్తించడానికి సులభతరం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కరోనావైరస్ నుండి దేశాన్ని రక్షించడానికి ముందు జాగ్రత్త చర్యగా యూఏఈ ఆరోగ్య అధికారుల సహకారంతో ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







