అలెర్ట్..అలెర్ట్! యూఏఈ లో మరో రెండు కరోనావైరస్ కేసులు
- February 08, 2020
యూఏఈ: కరోనావైరస్ సంక్రమణకు సంబంధించిన రెండు కొత్త కేసులను యూఏఈ ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఏడుకి చేరుకుంది. తాజాగా వైరస్ సోకివారిలో ఒకరు ఫిలిపినో (మొదటి నాన్ - చైనీస్ వ్యక్తి) మరొకరు చైనీస్ గా గుర్తించారు.
కరోనావైరస్ సంక్రమించే ప్రమాదం ఉన్న రోగులను గుర్తించడానికి ‘ప్రిడిక్టివ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్’ ను గత వారం ప్రారంభించినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ (వారీద్ సిస్టమ్) ను అన్ని హాస్పిటల్స్ లో పొందుపరచటం జరిగిందని తద్వారా కరోనావైరస్ సంక్రమణను పొందే ప్రమాదం ఉన్న వ్యక్తులను త్వరగా గుర్తించడానికి సులభతరం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కరోనావైరస్ నుండి దేశాన్ని రక్షించడానికి ముందు జాగ్రత్త చర్యగా యూఏఈ ఆరోగ్య అధికారుల సహకారంతో ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







