అలెర్ట్..అలెర్ట్! యూఏఈ లో మరో రెండు కరోనావైరస్ కేసులు
- February 08, 2020
యూఏఈ: కరోనావైరస్ సంక్రమణకు సంబంధించిన రెండు కొత్త కేసులను యూఏఈ ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఏడుకి చేరుకుంది. తాజాగా వైరస్ సోకివారిలో ఒకరు ఫిలిపినో (మొదటి నాన్ - చైనీస్ వ్యక్తి) మరొకరు చైనీస్ గా గుర్తించారు.
కరోనావైరస్ సంక్రమించే ప్రమాదం ఉన్న రోగులను గుర్తించడానికి ‘ప్రిడిక్టివ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్’ ను గత వారం ప్రారంభించినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ (వారీద్ సిస్టమ్) ను అన్ని హాస్పిటల్స్ లో పొందుపరచటం జరిగిందని తద్వారా కరోనావైరస్ సంక్రమణను పొందే ప్రమాదం ఉన్న వ్యక్తులను త్వరగా గుర్తించడానికి సులభతరం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కరోనావైరస్ నుండి దేశాన్ని రక్షించడానికి ముందు జాగ్రత్త చర్యగా యూఏఈ ఆరోగ్య అధికారుల సహకారంతో ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







