రేస్‌ని స్పాన్సర్‌ చేసిన దుబాయ్‌ స్టూడియో సిటీ

- February 08, 2020 , by Maagulf
రేస్‌ని స్పాన్సర్‌ చేసిన దుబాయ్‌ స్టూడియో సిటీ

దుబాయ్‌ విమెన్‌ టూర్‌ - సెలబ్రేటింగ్‌ ది దుబాయ్‌ విమెన్‌ టూర్‌ 2020 ఛాలెంజ్‌ రేజ్‌లో 80 మంది ఎమిరేటీ మరియు వలస సైక్లిస్ట్‌లు పాల్గొన్నారు. 60 కిలోమీటర్ల లూప్‌లో యూఏఈలోని షార్జాలోగల అల్‌ హమ్రియాలో ఈ కార్యక్రమం జరిగింది. అమెచ్యూర్‌ సైక్లిస్టులందరికీ ఈ రేస్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. మిడిల్‌ ఈస్ట్‌లో తొలి మహిళా ప్రొఫెషనల్‌ సైక్లింగ్‌ రేస్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఓపెన్‌ మేల్‌ కేటగిరీలో మన్సూర్‌ తని మరియు అహ్మద్‌ అల్‌ బ్లూషి మధ్య టఫ్‌ ఫైట్‌ నెలకొంది. కాగా, ఓపెన్‌ ఫిమేల్‌ కేటగిరీలో సమాహ్‌ ఖాలెద్‌ సత్తా చాటారు. విజేతల మధ్య సెకెను కంటే తక్కువ తేడా నమోదు కావడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com