మహిళను హతమార్చిన వలసదారుడు
- February 12, 2020
ఫుజేరా క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్, 25 ఏళ్ళ ఆసియా వ్యక్తిని మర్డర్ కేసులో దోషిగా తేల్చింది. కోర్టు ఫైల్స్ వివరాల ప్రకారం నిందితుడు, ఓ ఇంట్లోకి చొరబడి విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఫసీల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద కత్తితో ఓ మహళపై దాడి చేశాడు నిందితుడు. దాంతో, ఆమె ప్రాణాలు కోల్పోయింది. కాగా, 11 ఏళ్ళ బాలుడినీ, 11 ఏళ్ళ బాలికనీ నిందితుడు తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఇద్దరూ బాధితురాలి పిల్లలు. కాగా, ఆ ఇంట్లో డొమెస్టిక్ హెల్పర్గా పనిచేస్తున్న మరో మహిళపై కూడా నిందితుడు దాడి చేశాడు. అనంతరం నిందితుడు, బాధితురాలి కారుపై పారిపోయాడు. కాగా, ఫుజేరా పోలీసులు అత్యంత చాకచక్యంగా నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మరోపక్క, నిందితుడి మానసిక స్థితిపై వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







