మహిళను హతమార్చిన వలసదారుడు

- February 12, 2020 , by Maagulf
మహిళను హతమార్చిన వలసదారుడు

ఫుజేరా క్రిమినల్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్‌, 25 ఏళ్ళ ఆసియా వ్యక్తిని మర్డర్‌ కేసులో దోషిగా తేల్చింది. కోర్టు ఫైల్స్‌ వివరాల ప్రకారం నిందితుడు, ఓ ఇంట్లోకి చొరబడి విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఫసీల్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద కత్తితో ఓ మహళపై దాడి చేశాడు నిందితుడు. దాంతో, ఆమె ప్రాణాలు కోల్పోయింది. కాగా, 11 ఏళ్ళ బాలుడినీ, 11 ఏళ్ళ బాలికనీ నిందితుడు తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఇద్దరూ బాధితురాలి పిల్లలు. కాగా, ఆ ఇంట్లో డొమెస్టిక్‌ హెల్పర్‌గా పనిచేస్తున్న మరో మహిళపై కూడా నిందితుడు దాడి చేశాడు. అనంతరం నిందితుడు, బాధితురాలి కారుపై పారిపోయాడు. కాగా, ఫుజేరా పోలీసులు అత్యంత చాకచక్యంగా నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. మరోపక్క, నిందితుడి మానసిక స్థితిపై వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com