అబుధాబి:BAPS హిందు మందిర్ కోసం రికార్డు స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్
- February 14, 2020అబుధాబి - BAPS హిందూ మందిర్ కోసం అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. రాఫ్ట్ ఫౌండేషన్ కోసం రికార్డు స్థాయిలో కాంక్రీట్ని నింపే కార్యక్రమం ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యింది. పూజ్య బ్రహ్మవిహారి స్వామి మరియు పూజ్య అక్షయ్ మునిదాస్ స్వామి ప్రత్యేక పూజలు నిర్మాణ స్థలి వద్ద చేపట్టారు. యూఏఈలో భారత రాయబారి అయిన పవన్ కపూర్, దుబాయ్లో ఇండియా కాన్సుల్ జనరల్ విపుల్, కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ డాక్టర్ ఒమన్ అల్ ముథానా, షాపూర్జీ పల్లోంజీ సీఈఓ మోహన్దాస్ సైని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాచీన సాంకేతికతకు మోడ్రన్ టెక్నాలజీని జోడించి ఈ మందిర్ నిర్మాణం చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ‘ఈ దేశాన్ని కేవలం నివసించడానికి మాత్రమే కాదు, దీన్ని తమ సొంత దేశంగా భావిస్తున్నాం..’ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు భారతీయ వలసదారులు అభిప్రాయపడ్డారు. 55 శాతం ఫ్లై యాష్తో, 3,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ మిక్స్ని ఒకే దఫాలో రాఫ్ట్ ఫౌండేషన్ కోసం వినియోగించారు. 300 హైటెక్ సెన్సార్స్, 10 డిఫరెంట్ లెవల్స్లో డేటాను విశ్లేషించి తదనుగుణంగా నిర్మాణం చేపడుతున్నారు. ఖలీఫా యూనివర్సిటీ ప్రొఫెసర్ కిషిదా తదాహిరో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2022 నాటికి ఈ మందిర నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..