చైనా నుంచి వచ్చేవారిపై పూర్తి బ్యాన్‌

- February 14, 2020 , by Maagulf
చైనా నుంచి వచ్చేవారిపై పూర్తి బ్యాన్‌

బహ్రెయిన్:గవర్నమెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ జారీ చేసిన డెసిషన్‌ నేపథ్యంలో చైనా నుంచి వచ్చే ప్రయాణీకులపై పూర్తిస్థాయిలో బ్యాన్‌ విధించనున్నారు. 14 రోజులకు ముందుగా ఎవరైతే చైనాలో పర్యటిస్తారో, వారికి బహ్రెయిన్‌లో ప్రవేశం ఇకపై వుండదు. కరోనా వైరస్‌ (కోవిడ్‌19) తీవ్రత నేపథ్యంలో బహ్రెయిన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. క్రౌన్‌ ప్రిన్స్‌, డిప్యూటీ సూప్రీమ్ కమాండర్‌, ఫస్ట్‌ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌ ప్రిన్స్‌ సల్మాన్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా నేతృత్వంలోని గవర్నమెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, బహ్రెయినీ పౌరులు, జిసిసి దేశాలకు చెందిన పౌరులు, బహ్రెయినీ రెసిడెంట్స్‌, గత 14 రోజుల్లో చైనా వెళ్ళి వుంటే, వారు ఖచ్చితంగా వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ సూచన మేరకు వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com