కార్లలోంచి చెత్త పారేస్తే 1,000 దిర్హాముల జరీమానా, 6 బ్లాక్‌ పాయింట్లు

- February 14, 2020 , by Maagulf
కార్లలోంచి చెత్త పారేస్తే 1,000 దిర్హాముల జరీమానా, 6 బ్లాక్‌ పాయింట్లు

అబుధాబి:చెత్తని వాహనాల్లోంచి నిర్లక్ష్యంగా బయట పారేస్తున్న కేసులు 355 వరకు నమోదయినట్లు అబుధాబి పోలీస్‌ వెల్లడించింది. 2019లో నమోదైన కేసుల సంఖ్య ఇది. ఇలా చేసినవారికి 1,000 దిర్హాముల జరీమానా, అలాగే 6 బ్లాక్‌ పాయింట్స్‌ని విధిస్తారు. రోడ్లపైనా, ఇతర ప్రాంతాల్లోనూ చెత్త పారేయడం పర్యావరణానికి కీడు చేస్తుందని అధికారులు అంటున్నారు. ఇలాంటి ఉల్లంఘనల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అబుధాబి ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ కల్నల్‌ సైఫ్‌ హమాద్‌ అల్‌ జాబి చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com