అబుదాబి: ఫస్ట్ ఈవెంట్ ఆతిథ్యం ఇవ్వనున్న ఎతిహాద్ ఎరినా
- February 14, 2020
అబుదాబి మిడ్ ఏప్రిల్ లో ఫస్ట్ ఈవెంట్ కు రెడీ అయ్యింది. మల్టి పర్పస్ ఇండోర్ వెన్యూ ఎతిహాద్ ఎరినా ఇందుకు ఆతిథ్యం ఇవ్వనుంది మిరాల్ ప్రకటించింది. అబేదాబి ల్యాండ్ మార్క్ వెన్యూ ఎతిహాద్ ఎరినాలో ఈ ఏడాది నిర్వహించబోతున్న తొలి ఈవెంట్ కోసం ఎక్సైట్మెంట్ గా ఎదురుచూస్తున్నామని మిరాల్ చైర్మన్ మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ వెల్లడించారు. ఎతిహాద్ ఎరినా యూఏఈలో కొత్త హబ్ గా అవతరించబోతుందన్నారు. ఇది యస్ ఐలాండ్స్ విజన్, ఎంటర్టైన్మెంట్ కు ఇది గ్లోబల్ డెస్టినేషన్ గా మారుతుందన్నారు. యూఈఏ ఎకానమీ విస్తరణలోనూ ఇది కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. 200 నుంచి 18 వేల వరకు ఆడియన్స్ కెపాసిటీతో నిర్మించిన ఎతిహాద్ ఎరినా ఒక్కసారి ప్రజలకు అందుబాటులోకి రాగానే లైవ్ ఎంటర్టైన్మెంట్ కు ల్యాండ్ మార్క్ గా అవుతుందని మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారఖ్ వెల్లడించారు. వరల్డ్ క్లాస్ స్పోర్టింగ్ కాంపిటీషన్స్ దగ్గర్నుంచి మ్యూజికల్ షోస్, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ తో పాటు యస్ ఐలాండ్స్ ఎంటర్టైన్మెంట్ ను ఎలివేట్ చేసేందుకు ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే అబుదాబి టూరిజమ్ డెవలప్మెంట్ లోనూ కీలక మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







