అంటార్కిటికాలో డేంజర్ బెల్స్..గతంలో ఎన్నడూ లేనంతగా టెంపరేచర్స్
- February 14, 2020రోజురోజుకి పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ అంటార్కిటికాలో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. భూమ్మీద అత్యంత శీతల ప్రాంతమైన అంటార్కిటికాలో రికార్డ్ స్థాయి టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. తొలిసారి ఏకంగా 20.75 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు సైంటిస్టులు ప్రకటించారు. ఇప్పటివరకు ఇక్కడ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 19 డిగ్రీలు. అయితే..పాత రికార్డును బ్రేక్ చేస్తూ ఈ సీజన్ లో మరో డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెరిగిందని సైంటిస్టులు వివరించారు. అంటార్కిటికా ఉత్తరాగ్ర భాగంలో ఉన్న సైమోర్ ద్వీపంలో ఈ రికార్డ్ టెంపరేచర్స్ నమోదైంది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని స్పష్టంగా చెప్పలేమని సైంటిస్టులు అంటున్నా...అత్యంత శీతల ప్రాంతంలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!