మహిళలూ అర్హులే.. సుప్రీం ఆదేశాలు
- February 17, 2020
న్యూఢిల్లీ: ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత గ్రాంట్ కమిషన్ హోదా కల్పించాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మహిళలకు పురుషులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించాలని పేర్కొంది. మహిళలకు పర్మినెంట్ గ్రాంట్ కమిషన్ హోదా కల్పించడంపై గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. మహిళల సామర్థ్యంపై ప్రభుత్వం తన ఆలోచనా ధోరణి మార్చుకోవాలని.. కమాండ్ విధులకు మహిళా అధికారులు కూడా అర్హులేనని తేల్చి చెప్పింది. మహిళా అధికారులకు 3 నెలల్లో శాశ్వత కమిషన్ హోదా కల్పించాలని ఆదేశించింది.
మహిళలకు శాశ్వత గ్రాంట్ కమిషన్పై 2010లో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. కమాండ్ హోదాలో మహిళలకు అవకాశం కల్పించడం కష్టసాధ్యమని సుప్రీం కోర్టుకు కేంద్రం విన్నవించింది. దీనిపై సుప్రీం తాజా ఆదేశాలు ఇచ్చింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







