శివుడి కోసం కేటాయించిన సీటు
- February 17, 2020
వారణాసి నుంచి ఇండోర్ మధ్య నడిచే కాశీమహాకాల్ ఎక్స్ప్రెస్ అనే కొత్త రైలును ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. అయితే ఆ రైలులోని బీ5 ఏసీ కోచ్లో 64వ బెర్త్ను పరమేశ్వరుడికి కేటాయించారు. ఆ సీటులో శివుడికి పూజలు చేసి రైలును స్టార్ట్ చేశారు. కాశీలోని విశ్వనాథ్, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్, ఇండోర్లోని ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలను టచ్ చేస్తూ ఆ రైలు వెళ్తుంది. బోళాశంకరుడి కోసం కేటాయించిన ఆ సీటును పర్మనెంట్గా ఉంచాలా లేదా అన్న దానిపై ఇంకా అధికారులు నిర్ణయం తీసుకోలేదు. రైలులో దేవుడి కోసం ఓ సీటును కేటాయించి, ఆ సీటును ఖాళీగా వదిలేయడం ఇదే మొదటిసారి. శివుడి కోసం కేటాయించిన సీటును అందంగా తీర్చిదిద్దారు. మహాకాళేశ్వరుడి ఆలయం బొమ్మను వేశారు. రైలులో ఆధ్మాత్మిక మ్యూజిక్ను ప్లే చేస్తారు. కేవలం వెజిటేరియన్ మీల్స్ను సర్వ్ చేయనున్నారు. మొత్తం థార్డ్ ఏసీ కోచ్లతో ఉండే ఈ రైలు వారానికి మూడు సార్లు నడుస్తుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







