శివుడి కోసం కేటాయించిన సీటు
- February 17, 2020
వారణాసి నుంచి ఇండోర్ మధ్య నడిచే కాశీమహాకాల్ ఎక్స్ప్రెస్ అనే కొత్త రైలును ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. అయితే ఆ రైలులోని బీ5 ఏసీ కోచ్లో 64వ బెర్త్ను పరమేశ్వరుడికి కేటాయించారు. ఆ సీటులో శివుడికి పూజలు చేసి రైలును స్టార్ట్ చేశారు. కాశీలోని విశ్వనాథ్, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్, ఇండోర్లోని ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలను టచ్ చేస్తూ ఆ రైలు వెళ్తుంది. బోళాశంకరుడి కోసం కేటాయించిన ఆ సీటును పర్మనెంట్గా ఉంచాలా లేదా అన్న దానిపై ఇంకా అధికారులు నిర్ణయం తీసుకోలేదు. రైలులో దేవుడి కోసం ఓ సీటును కేటాయించి, ఆ సీటును ఖాళీగా వదిలేయడం ఇదే మొదటిసారి. శివుడి కోసం కేటాయించిన సీటును అందంగా తీర్చిదిద్దారు. మహాకాళేశ్వరుడి ఆలయం బొమ్మను వేశారు. రైలులో ఆధ్మాత్మిక మ్యూజిక్ను ప్లే చేస్తారు. కేవలం వెజిటేరియన్ మీల్స్ను సర్వ్ చేయనున్నారు. మొత్తం థార్డ్ ఏసీ కోచ్లతో ఉండే ఈ రైలు వారానికి మూడు సార్లు నడుస్తుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!