‘దేవినేని’ సినిమా డబ్బింగ్ లో సురేష్ కొండేటి
- February 18, 2020
వంగవీటి మోహనరంగా గొంతు ఎలా ఉంటుందో మనకు తెలియదుగానీ సురేష్ కొండేటి రంగా పాత్రకు డబ్బంగ్ చెబుతుంటే అక్కడున్న వారంతా అదరహో అన్నారు. నిజంగా రంగా గొంతు ఇలాగే ఉంటుందేమో అనికూడా అన్నారు. తారకరత్న, సురేష్ కొండేటి హీరోలుగా తెరెకెక్కుతున్న ‘దేవినేని’ చిత్రం డబ్బింగ్ దశలో ఉంది. రంగా పాత్రను పోషిస్తున్న సురేష్ కొండేటి సోమవారం ప్రసాద్ ల్యాబ్ డబ్బింగ్ ధియేటర్లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పారు. శివనాగేశ్వర్రావు (శివనాగు) దర్శకత్వంలో ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రామూరాథోడ్, జి.ఎస్.ఆర్.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్, ఎడిటింగ్ కార్యక్రమాను పూర్తి చేసుకున్న ఈ చిత్రం వారం రోజుగా డబ్బింగ్ కార్యక్రమాల్లో ఉంది.
చిత్ర దర్శకుడు శివనాగు మాట్లాడుతూ.. ‘ఆనాటి మహాభారతం, రామాయణం కథల్లో ఏముందో మనందరికీ తెలుసు. విజయవాడలో దేవినేని నెహ్రూ, రంగాల మధ్య ఏం జరిగిందో కొంతే మనకు తెలుసు. వారిద్దరి మధ్యా ఎలాంటి సంఘర్షణ జరిగింది, అది ఘర్షణకు ఎలా దారితీసింది అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది’ అని వివరించారు. ఈ సినిమాకు సంబంధించి వరుసగా డబ్బింగ్ కార్యక్రమం జరుగుతున్నాయని వివరించారు. ఏప్రిల్ మొదటివారంలో సినిమా విడుదవుతుందని చెప్పారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ రంగా పాత్రకు డబ్బింగ్ చెప్పడం చాలా థ్రిల్ కలిగించిందని అన్నారు. కంటిన్యూగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. రంగాతో తనకు అంతగా పరిచయం లేకపోయినా ఆయన ఎలా మాట్లాడి ఉంటారో ఊహించుకుని మాట్లాడానన్నారు. తొలిరోజు డబ్బింగ్ కు మంచి అప్లాజ్ రావడం ఆనందం కలిగించిందని చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన రామూరాథోడ్ మాట్లాడుతూ.. మేము అనుకున్నదానికన్నా సినిమా బాగా వచ్చింది. ఎక్కడా రాజీపడకుండా చిత్రీకరించామన్నారు. మరో నిర్మాత జి.ఎస్.ఆర్.చౌదరి మాట్లాడుతూ.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాు చురుకుగా సాగుతున్నాయని చెప్పారు. ఇందులో హీరోయిన్లుగా నవీనారెడ్డి, తేజా రెడ్డి నటిస్తున్నారు. రాజ్ కిరణ్ ఈ చిత్రానికి చక్కని సంగీతం అందించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!