వుహాన్: కరోనా వైరస్ కు బలైన ఆస్పత్రి డైరెక్టర్
- February 18, 2020
బీజింగ్ : కరోనా వైరస్ రక్కసి రోజురోజుకూ విజృంభిస్తోంది. చైనా ప్రజలు ఈ వైరస్తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు రోజురోజుకూ ఈ వైరస్ భారీన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో చైనా ప్రజలు హడలిపోతున్నారు. ఇప్పటి వరకూ 1868 మంది ప్రాణాలు కోల్పోగా.. 72 వేల మంది కోవిడ్ భారీన పడ్డారని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఈ వైరస్ను కనుగొన్న.. ఈ కరోనా భారీన పడిన వారికి చికిత్స చేస్తున్న వైద్యులకు కూడా సోకడంతో వారు కూడా మృత్యువాత పడుతున్నారు. దీంతో చైనా వ్యాప్తంగా ఆంక్షలు విధించడం జరిగింది. అంతేకాదు.. అత్యవసరం అయితే తప్ప బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.
తాజాగా.. వుహాన్లోని ఆస్పత్రి డైరెక్టర్ కూడా ఈ వైరస్తో కన్నుమూశారు. మంగళవారం నాడు.. వుచాంగ్ ఆస్పత్రి డైరెక్టర్ లియు ఝిమింగ్ ఈ వైరస్తో మృతి చెందినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఝిమింగ్ ఈ ఆస్పత్రికి తొలి డైరెక్టర్. ఇలా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు, డైరెక్టర్లే కరోనాతో చనిపోతున్నారంటే.. దాని తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా.. కరోనాను కనుగొన్న వైద్యుడు ఈ వైరస్ భారీన పడి చైనాలోని వూహాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







