వుహాన్: కరోనా వైరస్ కు బలైన ఆస్పత్రి డైరెక్టర్
- February 18, 2020బీజింగ్ : కరోనా వైరస్ రక్కసి రోజురోజుకూ విజృంభిస్తోంది. చైనా ప్రజలు ఈ వైరస్తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు రోజురోజుకూ ఈ వైరస్ భారీన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో చైనా ప్రజలు హడలిపోతున్నారు. ఇప్పటి వరకూ 1868 మంది ప్రాణాలు కోల్పోగా.. 72 వేల మంది కోవిడ్ భారీన పడ్డారని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఈ వైరస్ను కనుగొన్న.. ఈ కరోనా భారీన పడిన వారికి చికిత్స చేస్తున్న వైద్యులకు కూడా సోకడంతో వారు కూడా మృత్యువాత పడుతున్నారు. దీంతో చైనా వ్యాప్తంగా ఆంక్షలు విధించడం జరిగింది. అంతేకాదు.. అత్యవసరం అయితే తప్ప బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.
తాజాగా.. వుహాన్లోని ఆస్పత్రి డైరెక్టర్ కూడా ఈ వైరస్తో కన్నుమూశారు. మంగళవారం నాడు.. వుచాంగ్ ఆస్పత్రి డైరెక్టర్ లియు ఝిమింగ్ ఈ వైరస్తో మృతి చెందినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఝిమింగ్ ఈ ఆస్పత్రికి తొలి డైరెక్టర్. ఇలా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు, డైరెక్టర్లే కరోనాతో చనిపోతున్నారంటే.. దాని తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా.. కరోనాను కనుగొన్న వైద్యుడు ఈ వైరస్ భారీన పడి చైనాలోని వూహాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం