చైనాకు మెడికల్ సపోర్ట్..8 ఫ్లైట్లలో మెడిసిన్ పంపిస్తున్న ఖతర్
- February 18, 2020దోహా:కరోనా వైరస్ తో వణికిపోతున్న చైనాకు బాసటగా నిలవాలని ఖతర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఖతార్ నుంచి చైనాకు మెడికల్ సపోర్ట్ అందించనుంది. ఈ నెల 21న 8 ఖతర్ ఎయిర్ వేస్ లో కోవిడ్-19ను ఎదుర్కునేందుకు అవసరమైన మెడిసిన్, మెడికల్ కిట్లను పంపిస్తున్నట్లు ఖతార్ నేషనల్ టూరిజమ్ కౌన్సిల్, ఖతర్ ఎయిర్ లైన్స్ గ్రూప్ జీసీఈవో జనరల్ సెక్రటరీ హెచ్ ఈ అక్బర్ అల్ బకర్ పేర్కొన్నారు. 17వ దోహ జ్యూలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొన్న అక్బర్ అల్ బకర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎనిమిది ఫ్లైట్స్ లో రెండింటిని బీజింగ్కు, మూడింటిని షాంఘైకి, మిగిలిన మూడు విమానాలు గ్వాంగ్జౌకు మెడికల్ కిట్లను తీసుకెళ్తాయని ఆయన చెప్పారు. అన్ని విమానాలు నాలుగు నిమిషాల విరామంలో ఆయా ఎయిర్ పోర్టుల్లో ల్యాండ్ అవుతాయని వెల్లడించారు. కోవిడ్ -19 కారణంగా చైనా ప్రయాణాలపై పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే..తాము మాత్రం చైనా ఫ్లైట్ సర్వీసులపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని..ఈ విపత్కర సమయంలో చైనాకు చేయూతగా నిలబడాలని నిర్ణయించినట్లు ఖతార్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు