దుబాయ్: డ్రగ్ స్మగ్లింగ్ కేసులో పాకిస్తానీకి పదేళ్ల జైలు శిక్ష
- February 19, 2020గ్రీన్ టీ బ్యాగ్స్ లో కిలోకు పైగా హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన పాకిస్తానీకి దుబాయ్ క్రిమినల్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే AED 50,000 ఫైన్ విధించింది. శిక్షా
కాలం పూర్తైన తర్వాత దేశం విడిచి వెళ్లాల్సిందిగా పాకిస్తానీ స్మగ్లర్ ను దుబాయ్ క్రిమినల్ కోర్టు ఆదేశించింది. కోర్టు రికార్డ్స్ ప్రకారం గత ఏడాది నవంబర్ 7న నిందితుడ్ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను గ్రీన్ టీ రాపర్స్ లో 1.1 కిలోల హెరాయిన్ నింపి.. టీ బాక్సెస్ నమ్మించబోయాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో తెల్లవారుజామున ఫ్లైట్ దిగిన నిందితుడి దగ్గర టీ బాక్సుల లగేజీ ఎక్కువగా ఉండటం ఎయిర్ పోర్టు కస్టమ్స్ అఫీసర్స్ కి అనుమానం కలిగింది. అసాధారణ స్థాయిలో టీ బ్యాక్స్ ఎందుకు తీసుకెళ్తున్నాడనే సందేహంతో అతని లగేజ్ ను కస్టమ్స్ అఫీసర్స్ చెక్ చేశారు. టీ బ్యాగ్స్ రాపర్స్ లో అనుమానిత పౌడర్ ను గుర్తించిన అధికారులు వెంటనే అతన్ని పోలీసులు, యాంటీ డ్రగ్స్ ఫోర్స్ కి అప్పగించారు. ఫోరెన్సిక్ టెస్ట్ తర్వాత హెరాయిన్ అని నిర్ధారణ కావటంతో పాకిస్తానీ స్మగ్లర్ ను అరెస్ట్ చేశారు. క్రిమినల్ కోర్టులో నేరం రుజువు కావటంతో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే..రెండు వారాల్లో అతను అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది.
తాజా వార్తలు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు