కళాతపస్వి కె.విశ్వనాధ్ జన్మదినోత్సవం సందర్భంగా 'శివాష్టపది' సంగీత విభావరి
- February 19, 2020
హైదరాబాద్: "స" అక్షరం సెంటిమెంట్ తో ఎన్నో సంగీత సాంప్రదాయ ప్రధాన చిత్రాలను అందించిన కళాతపస్వి కె.విశ్వనాద్. ఆయన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు బంజారాహిల్స్ లోని లా లిబర్టీ హోటల్ లో " శివాష్టపది" పేరుతో సంగీతావిభవరి నిర్వహించారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సువర్ణభూమి శ్రీధర్ ఆధ్వర్యంలో తాడికొండ విజయ కుమార్ సారధ్యంలో ఈ కార్యక్రమం జరిగింది .ఈసందర్బంగా ప్రముఖ సినీ నేపధ్య గాయకుడు,స్వరకర్త పార్ధసారధి , గాయనీ మణులు నిత్య సంతోషిని, గోపిక పూర్ణిమ ల బృంద చే " శివాష్టపది" పేరుతో సంగీత విభావరి నిర్వహించారు. విశ్వనాథ్ ,వేటూరి సుందరరామ్మూర్తి కాంబినేషన్ లో వచ్చిన అనేక పాటల్ని ఆలపించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిధి గా ఆంద్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శి ఐ. ఏ.ఎస్. ఎల్.వి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హిమాన్షు చౌదరిLl కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కళతాపస్విని ఘనంగా సత్కరించారు. సువర్ణ భూమి అధినేత శ్రీధర్ బొలినేని, సినీ నటులు బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, రావి కొండలరావు, సినీ రచయిత జనార్ధన్ మహర్షి అనేకమంది విశ్వనాథ అభిమానులు సుప్రసిద్ధ వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణామూర్తి ఈ కార్యక్రానికి సంధాన కర్తగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







