కిడ్నాప్‌ అయిన తనయుడ్ని 24 ఏళ్ళ తర్వాత కలిసిన తండ్రి

- February 21, 2020 , by Maagulf
కిడ్నాప్‌ అయిన తనయుడ్ని 24 ఏళ్ళ తర్వాత కలిసిన తండ్రి

సౌదీ అరేబియా:డిఎన్‌ఎ టెస్ట్‌, కుటుంబానికి దూరమైన కొడుకుని తండ్రికి దగ్గర చేసింది. సౌదీ గెజిట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం అలీ అల్‌ ఖెనిజి తనయుడు ముసా, 1996లో కిడ్నాప్‌కి గురయ్యారు. దమామ్  లోని చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో చిన్నారికి తన భార్య జన్మనిచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని అలి అల్‌ ఖెనిజి చెప్పారు. కుమారుడు కిడ్నాప్‌కి గురవడంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని ముసా తల్లిదండ్రులు తమ ఆవేదనను వివరించారు. ఎట్టకేలకు తమ కుమారుడు తమకు దక్కాడనీ, డీఎన్‌ఏ పరీక్షల ద్వారా తమ కుమారుడ్ని తాము సొంతం చేసుకోగలిగామనీ, ఇది సెలబ్రేషన్స్‌ సమయం అని వారు చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com