అలా చేస్తే పాక్‌-భారత్‌ చర్చలు ఫలిస్తాయి: వైట్ హౌస్

- February 22, 2020 , by Maagulf
అలా చేస్తే పాక్‌-భారత్‌ చర్చలు ఫలిస్తాయి: వైట్ హౌస్

అమెరికా: అగ్రరాజ్యం అమెరికా భారత్, పాక్‌ల మధ్య చర్చలు ఫలప్రదం కావాలంటే ఉగ్రవాదంపై సరైన చర్యలు తీసుకోవాలని తాజాగా శ్వేతసౌధం శుక్రవారం ఓ ప్రకటన చేసింది. తన భూభాగంలోని ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద మూకలపై పాకిస్థాన్ కచ్చితంగా చర్యలు తీసుకుంటేనే భారత్, పాక్‌ల మధ్య చర్చలు విజయవంతమవుతాయని అగ్రరాజ్యం మరోసారి స్పష్టం చేసింది. కాగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ట్రంప్ తన వంతు సహాకారం అందజేస్తారని, ఇరు దేశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాలని శ్వేతసౌధం ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భారత పర్యటన సందర్భంగా కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వంపై ట్రంప్ మళ్లీ ప్రకటన చేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. పై విధంగా స్పందించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com