జాంబీ డ్రగ్ : తన కాలును తానే నరుక్కునేలా చేసింది
- February 22, 2020
మాస్కో : జాంబీ డ్రగ్ ఓ యువకుడి జీవితాన్ని చిత్తు చేసింది. మితిమీరిన మత్తులో తన కాలును తానే నరుక్కునేలా చేసింది. ఈ సంఘటన రష్యాలోని ప్రొకొపైవిసాక్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రష్యా ప్రొకొపైవిసాక్కు చెందిన ఓ 29 యువకుడు పెద్ద మొత్తంలో ' జాంబీ డ్రగ్' ( ఒకరకమైన సింథటిక్ డ్రగ్) తీసుకున్నాడు. దీంతో పూర్తిగా మత్తులో పడిపోయాడు. ఆ మత్తులో తన ఎడమ కాలును శరీరం నుంచి వేరుచేసుకున్నాడు. దీంతో అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. కానీ, అప్పటికే ఆలస్యం అవ్వటంతో వైద్యులు అతని కాలును అతికించలేకపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడ్ని ఇంటెన్సివ్ కేర్కు తరలించారు. కాగా, సదరు వ్యక్తి ఎవరు, ఈ సంఘటన సరిగ్గా ఎప్పుడు జరిగిందన్న విషయాలు తెలియరాలేదు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







