ట్రాఫిక్ జరీమానాలపై 100 శాతం డిస్కౌంట్, మళ్ళీ వచ్చిందోచ్!
- February 24, 2020
దుబాయ్ పోలీస్, ట్రాఫిక్ ఫైన్ ఈనీషియేటివ్ని ఇంకోసారి ప్రకటించింది. జరీమానాలపై 100 శాతం డిస్కౌంట్ ఈ ఇనీషియేషన్ ప్రత్యేకత. ఫిబ్రవరి 6న మొదటి ఎడిషన్ పూర్తయిన వెంటనే, రెండో ఎడిషన్ అమల్లోకి వచ్చింది. గత ఏడాది ఈ ఇనీషియేషన్ ద్వారా 557,430 మంది మోటరిస్టులు జరీమానాల నుంచి ఉపశమనం పొందారు. కాగా, 546,970,930 దిర్హావ్ులు వాహనదారులకు మిగిలింది. కాగా, గత ఏడాది ట్రాఫిక్ మరణాలు 16 శాతానికి తగ్గాయి. మేజర్ ఇంజ్యురీస్ కూడా 38 శాతం తగ్గాయి. ఇదిలా వుంటే, ట్రాఫిక్ జరీమానాల డిస్కౌంట్ నుంచి 114,769 మంది పురుషులు, 444,661 మంది మహిళలు లబ్ది పొందినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మొదటి మూడు నెలల్లో ఉల్లంఘనలకు పాల్పడకపోతే 25 శాతం, ఆరు నెలలపాటు ఉల్లంఘనలకు పాల్పడనివారికి 50 శాతం డిస్కౌంట్, 9 నెలలపాటు ఉల్లంఘనలకు పాల్పడని పక్షంలో 75 శాతం, ఏడాది పాటు ఉల్లంఘనలకు పాల్పడకపోతే 100 శాతం అంతకు ముందు జరీమానాలపై డిస్కౌంట్ పొందేందుకు వాహనదారులకు అవకాశం కల్పిస్తున్నారు దుబాయ్ పోలీసులు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







