కువైట్లో 3 కన్ఫర్మ్డ్ కరోనా వైరస్ కేసులు
- February 24, 2020కువైట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, కువైట్లోకి ముగ్గురు కరోనా వైరస్ బాధితులు ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఇరానియన్ సిటీ మషాద్ నుంచి వీరు కువైట్కి వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో మొదటి వ్యక్తి 53 ఏళ్ళ కువైటీ కాగా, మరో వ్యక్తి 61 ఏళ్ళ సౌదీ సిటిజన్. అయితే ఈ ఇద్దరూ నార్మల్ కండిషన్లోనే వున్నారు. వీరికి ఎలాంటి వైరస్ లక్షణాలూ లేవు. కాగా, మూడో కేసు విషయానికొస్తే, 21 ఏళ్ళ వ్యక్తి ప్రాథమిక సింటమ్స్తో వున్నారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని మెడికల్ స్టాఫ్ అబ్జర్వేషన్లో పెట్టారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల మేరకు ప్రమాణాలకు అనుగుణంగా వైద్య పరీక్షల్ని కువైట్ యంత్రాంగం నిర్వహిస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..