ఒమన్ కు విస్తరించిన కరోనా వైరస్..రెండు పాజిటీవ్ కేసులు నమోదు
- February 25, 2020ఒమన్:ఎన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టినా కోవిడ్-19 వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. లేటెస్ట్ గా ఒమన్ లోనూ తొలిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇరాన్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలకు వైరస్ సోకినట్లు నిర్ధారించారు. అయితే..వారి హెల్త్ కండీషన్ స్టేబుల్ గానే ఉందని మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అధికారులు ప్రకటించారు. దీంతో ఒమన్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కరోనా వైరస్ ఎఫెక్టెడ్ కంట్రీస్ నుంచి వచ్చిన వారు సాధ్యమైనంత వకు ఇళ్లు వదిలి బయటికి రావొద్దని అధికారులు సూచించారు. అలాగే ఇరాన్ కు తక్షణమే ఫ్లైట్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలాఉంటే..బహ్రెయిన్, కువైట్ లో కూడా తొలి కరోనా కేసులు నమోదయ్యాయి. ఇరాన్ నుంచి వచ్చిన బహ్రెయిన్ వ్యక్తికి వైరస్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ నుంచి కువైట్ చేరుకున్న ముగ్గురు వైరస్ బారిన పడినట్లు కువైట్ హెల్త్ మినిస్ట్రి తెలిపింది. వైరస్ సోకిన ముగ్గురు సౌదీ పౌరులని వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు